V6 News

జీహెచ్ఎంసీలో అధికారుల బదిలీలు

జీహెచ్ఎంసీలో అధికారుల బదిలీలు


హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  ప్రస్తుతం అడిషనల్ కమిషనర్ (అడ్మిన్)గా ఉన్న సత్యనారాయణను చార్మినార్ జోనల్ కమిషనర్​గా, ముసారాంబాగ్ డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(డీసీ)గా ఉన్న భాస్కర్ రెడ్డిని సంతోష్ నగర్ సర్కిల్ డీసీగా, జంగంమెట్ డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాపయ్యను చాంద్రాయణగుట్ట సర్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీగా , డిప్యూటీ కమిషనర్ (ఎలక్షన్స్)గా ఉన్న విజయలక్ష్మిని ఎస్టేట్స్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బదిలీ చేశారు.